తిరుమలలో అపశ్రుతి చోటు చేసుకుంది. తిరుమల శ్రీవారి పాదాల గుట్టపై పాదాల మండపంలో ఉన్న స్వామివారి పాదాలలోని ఎడమపాదం బొటన వేలు విరిగింది. దీంతో భక్తలు అపచారం.. అపచారం అంటూ విషయాన్ని టీటీడీ అధికారులకు చేరవేశారు. ఇది గమనించిన స్థానికులు బొటన వేలును తిరిగి యథాస్థానంలో అతికించారు. ఈ ఘటనను చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో నారాయణగిరి పర్వతం వద్దకు చేరుకుంటున్నారు. అయితే టీటీడీ అధికారులు ఇంతవరకు స్పందించలేదు.