ఢిల్లీలో మరో నిర్భయ !

gang-rape-on-intermediate-student-in-kareemnagar1దేశ రాజధాని ఢిల్లీలో మహిళలపై అత్యాచారాలు ఆగడం లేదు. ఎన్ని చట్టాలు చేసినా.. నిర్భయ చట్టం అమలులోనికి వచ్చినా.. కామాంధులు బయపడటం లేదు. తాజాగా ఐదేళ్ళ బాలికపై ఓ కామాంధడు అతి కిరాతకంగా అత్యాచారానికి పాల్పడిన ఘటన తూర్పు ఢిల్లీలో లో వెలుగులోనికి వచ్చింది. మనోజ్ కుమార్ అనే కామాంధుడు బాలికను ఏప్రిల్ 15వ తేదీన అపహరించి, ఆహారం, మంచినీళ్లు ఇవ్వకుండా ఫ్లాట్లో బందీగా ఉంచి కిరాతకచర్యకు పాల్పడ్డాడు. అత్యాచారానికి గురైన బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. 24 గంటలు దాటితే గానీ పాప పరిస్థితి గురించి ఏమీ చెప్పలేమని వైద్యులు అంటున్నారు.

30 ఏళ్ల వయస్సు గల ఆ దుర్మార్గుడు తూర్పు ఢిల్లీలోని గాంధీనగర్లో బాలిక కుటుంబం ఉంటున్న అపార్టుమెంటులోనే ఉంటున్నాడు. బాలిక అరుపులు విన్న కుటుంబ సభ్యులు బుధవారం సాయంత్రం ఆమెను రక్షించారు. కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగువారు, ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు ఆస్పత్రి వెలుపల నిరసన ప్రదర్శనకు దిగారు. పోలీసులు కేసును మాయ చేయాలనే ప్రయత్నాలు చేసినట్లు ఆరోపిస్తున్నారు. తమ కూతురు అదృశ్యంపై ఫిర్యాదు చేస్తే కూడా పోలీసులు తీసుకోలేదని బాలిక తండ్రి చెప్పాడు. కాగా, పరారీలో ఉన్న నిందితుడిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు.