శంషాబాద్ లో మరో క్రికెట్ బుకీ అరెస్ట్ !

shamshabad-airportఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో అరెస్ట్ ల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో మరో బుకీని ఢిల్లీ పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. క్రికెట్ లో ప్రధాన బుకీగా మహ్మమద్ అనే వ్యక్తిపై గతకొన్ని రోజులుగా ఆరోపణలు వస్తున్నాయి. దీంతో పోలీసులు ఇతనికోసం గాలింపు చేపట్టారు. అయితే, పోలీసుల కళ్లుగప్పి దుబాయ్ చెక్కేద్దామనుకొన్న… మహ్మమద్ హైదరాబాద్ విమానాశ్రయంలో పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. డి గ్యాంగ్ తో సంబంధాలున్నట్లు భావిస్తున్న మహ్మమద్ హైదరాబాద్ విమానాశ్రయంనకు వస్తున్నాడని తెలుసుకున్న ఢిల్లీ పోలీసులు వలపన్ని మరి అరెస్ట్ చేశారు. దావూద్ ఇబ్రహీంతో సంబంధాలున్న ఇతనిని విచారిస్తే.. ఇంకా చాలా మంది ప్రముఖల పేర్లు బయటకు వచ్చే అవకాశాలున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.