ఆధార్ లో ఆంద్రానే టాప్..!

andhra-top-in-aadhar-cardsఆధార్ కార్డు నమోదులో ఆంధ్రపదేశ్ టాప్ ప్లేస్ లో ఉందని ఆధార్ ప్రాజెక్ట్ చైర్మెన్ నందన్ నీలేఖని తెలిపారు. సచివాలయంలో సిఎం కిరణ్ తో పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులతో నందన్ సమావేశమయ్యారు. అనంతరం ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మీయ్యతో కలసి నిలేఖన్ ఖైరతాబాద్ లోని మీసేవా కార్యలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా నందన్ విలేకరులతో మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా మొత్తం 27కోట్ల మందికి ఆధార్ కార్డులు జారీ కాగా, అందులో ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే 6కోట్ల వరకూ ఉన్నాయని పేర్కొన్నారు. ఆధార్ నమోదులో ఆంద్రపదేశ్ మిగతా రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలిచిందని కొనియాడారు.