‘ఆమెజాన్’ కస్టమర్లకు పండగే పండగా..

amazon-offersఆన్లైన్ దిగ్గజం ఆమెజాన్ మరోసారి కస్టమర్లకు ఆఫర్ల పండగను తెలిపింది. ఈరోజు అనగా 08-08-2016 నుండి 10-08-2016 వరకు ‘గ్రేట్ ఇండియన్ సేల్’ పేరుతో అన్ని ఉత్పత్తుల ఫై ఆఫర్లను ప్రకటించింది. స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, కిచెన్ అప్లయెన్సెస్, దుస్తులు, షూలు తదితర పాపులర్ బ్రాండ్లపై డిస్కౌంట్ సేల్స్ అనౌన్స్ చేసింది. అన్నిటి ఫై దాదాపు 30 నుండి 50 శాతం వరకు ఆఫర్లను ప్రకటించింది.

అంతేకాదు ఎస్‌బీఐ కార్డ్ హోల్డర్స్‌కు 10 శాతం రాయితీ కూడా లభిస్తుంది. ఆన్‌లైన్‌లో యాప్ ద్వారా బుక్ చేస్తే మరో 7.5 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. అయితే 5వేలకు పైగా కొనుగోలు చేసిన వారికి ఈ డిస్కౌంట్ పొందే ఛాన్స్ ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఆమెజాన్ సైట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వాటిని బుక్ చేసుకొని పండగా చేసుకోండి..