లంక ఆటవికం… తమిళ స్టార్స్ నిరసన

rajiniశ్రీలంకలో తమిళులకు స్వేచ్చలేదని, అక్కడ విశృంఖలంగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ తమిళ సినీ స్టార్లు ఇవాళ చెన్నైలో ఆందోళనకు దిగారు. యుద్ద నేరాలకు పాల్పడిన శ్రీలంక ప్రభుత్వానికి తగిన బుద్ది చెప్పాలని డిమాండ్ చేసారు. శరత్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళన కార్యక్రమంలో సూపర్ స్టార్ రజనీకాంత్ తో పాటు, సూర్య, కార్తి, శివకుమార్, సత్యరాజ్ ఇతర తమిళ ఆర్టిస్టులు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు పాల్గొన్నారు. మరోవైపు విద్యార్థి, రాజకీయలోకం కూడా తమిళుల ఊచకోతపై వివిధ రూపాల్లో తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు.