Site icon TeluguMirchi.com

మూగబోయిన 108 సేవలు !

108రాష్ట్రవ్యాప్తంగా 108 అత్యవసర సేవలు మూగబోయాయి. వేతనాల పెంపు విషయంలో 108 కాంట్రాక్టు ఉద్యోగులు మెరుపు సమ్మెకు దిగారు. ఈ విషయంలో.. జీవీకే యాజమాన్యంతో జరిగిన చర్చలు విఫలం కావడంతో గురువారం అర్థరాత్రి నుంచి సమ్మెకు సైరన్ మ్రోగించాయి. కనీస వేతనాన్ని 15 వేలకు పెంచాలని, రోజుకు 8 గంటలు పని, ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్లతో 108 ఉద్యోగులు సమ్మె చేస్తున్నట్లు తెలుస్తోంది. 108 అత్యవసర సేవల కాంట్రాక్టు ఉద్యోగుల సమ్మెతో రాష్ట్ర వ్యాప్తంగా అత్యవసర సేవలు నిలిచిపోయాయి. దీంతో..ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.

Exit mobile version