వైఎస్ బయోపిక్.. టైటిల్ యాత్ర


టాలీవుడ్ లో మరో బయోపిక్ కు రంగం సిద్దమైయింది. దివంగత సిఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ ఇది ‘ఆనందో బ్రహ్మ’ లాంటి బ్లాక్‌ బస్టర్‌ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు మహి వి. రాఘవ్‌ వైఎస్సార్‌ బయోపిక్‌ తెరకెక్కించనున్నారు. రీల్‌ లైఫ్‌ వెఎస్సార్‌ పాత్రలో ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి నటించనున్నారు.

ఈ విషయాన్ని చిత్రవర్గాలు సోషల్‌మీడియా ద్వారా ధ్రువీకరించాయి. ఈ సినిమాకు ‘యాత్ర’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. మే నుంచి చిత్రీకరణ మొదలవుతుందని చెప్పారు. వైఎస్సార్ బయోపిక్‌ను తెరకెక్కించడానికి ఆయన కుమారుడు, వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్‌ రెడ్డి కూడా అంగీకరించాడు. ఆయన అనుమతితోనే సినిమాను తెరకెక్కించనున్నారట.