ఈమధ్య విడుదల తేదీలు తరచూ వాయిదా పడుతున్నాయి. చిన్న సినిమాలే కాదు, పెద్ద సినిమాలు కూడా. ఇప్పుడు ఎవడు కూడా అలాంటి పరిస్థితిని ఎదుర్కోబోతోంది. రామ్చరణ్-వంశీపైడి పల్లి కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఎవడు. తొలుత ఈ చిత్రాన్ని ఈనెల25న తీసుకురావాలని భావించారు. ఇప్పటికీ అదే డేటు అనుకొంటున్నా ఇప్పుడుది కాస్త డౌటులో పడింది. 25 నాటికి కావల్సిన థియేటర్లు అందుబాటులో ఉంటాయా? లేదా? అని దిల్ రాజు ఆందోళన చెందుతున్నారు. 31న విడుదల చేస్తే ఏ గొడవా ఉండదని ఆయన ప్లాన్. అయితే 7న.. అత్తారింటికి దారేది విడుదలకు సిద్దంగా ఉంది. వారం రోజుల వ్యవధిలో రెండు మెగా సినిమాలంటే కచ్చితంగా ఒక సినిమాకి మైనస్గా మారుతుంది. ఇంకాస్త ఆగుదామంటే సినిమాపై నెగిటీవ్ ప్రచారం మొదలైపోతుంది. అందుకే ఏం చేయాలో దిల్రాజుకి పాలుపోవడం లేదు.