రామ్చరణ్ సినిమా ఎవడు ఇంకా సందిగ్దంలోనే ఉంది. ఈనెల 31న ఎట్టిపరిస్థితుల్లోనూ వచ్చేస్తాం అని చెప్పి రాత్రికి రాత్రే డేటు మార్చారు. ఆగస్టు 21న వస్తాం… అంటున్నారు. అయితే ఆ డేటూ డౌటే అనేది తాజా సమాచారమ్. ఎందుకటే ఎవడు – తుఫాన్ల మధ్య పదిహేను రోజుల గ్యాప్ కూడా లేదు. ఒక హీరో సినిమాలు ఇంత తక్కువ వ్యవధిలో విడుదలవ్వడం ఈ పదేళ్లలో ఇదే తొలిసారి. ఒక సినిమా హిట్ అయితే – ఆటోమెటిగ్గా రెండో సినిమా రేంజ్ పెరుగుతుంది. మరి ఎవడు ఫ్లాప్ అయితే తుఫాన్ పరిస్థితి ఏమిటి?? ఆ సినిమాపై ఎవడు తీవ్ర ప్రభావం చూపిస్తుంది!
పైగా జంజీర్ సినిమా చరణ్ కెరీర్కి చాలా కీలకం. ఎందుకంటే బాలీవుడ్లో అవకాశాలు రావాలంటే ఈ సినిమాతో హిట్ కొట్టాలి. అందుకే తన దృష్టిని తుఫాన్పై పెట్టే అవకాశాలున్నాయి. జంజీర్ ప్రమోషన్ కోసం ఇరవై రోజుల ముందే చరణ్ ముంబై వెళ్లాలి. ప్రెస్ మీట్లూ, ఇంటర్వ్యూలు అంటూ చాలా హడావుడి చేయాలి. అలాంటప్పుడు ఎవడు ప్రమోషన్లో పాల్గొనడం కుదరని పని. అందుకే తుఫాన్ వచ్చి వెళ్లిన తరవాత… ఎవడు రిలీజ్ చేసుకొంటే ఎలా ఉంటుంది?? అని దిల్ రాజు ఇప్పుడు తీరిగ్గా ఆలోచిస్తున్నాడట.