సినిమా సినిమాకీ బడ్జెట్ పెంచేసుకొంటున్నారు హీరోలు. ఒక సినిమా రూ.30 కోట్ల బడ్జెట్ తో పూర్తయితే మరో సినిమాకి రూ.40 చేస్తున్నారు. తన తొలి సినిమాతోనే కోట్లకు పడగెత్తాడు రామ్చరణ్. మగధీర, ఆరెంజ్, నాయక్… ఇవన్నీ భారీ బడ్జెట్ చిత్రాలే. రచ్చ మాత్రం కాస్త పరిమితుల్లో తీశారు. ఇప్పుడు ఎవడు రూ. 50 కోట్ల క్లబ్లో చేరిందట. ఈ సినిమాకి రూ. 50 కోట్లు ఖర్చయిందని సమాచారమ్. టెక్నికల్ గా ఉన్నతంగా తీర్చిదిద్దడం వల్ల, షూటింగ్ కోసం ఎక్కువ రోజులు కేటాయించడం వల్ల.. అనుకొన్న బడ్జెట్ కంటే ఎక్కువైందని సమాచారమ్. నాయక్ కూడా రూ.50 కోట్ల క్లబ్లో చేరింది. ఆ సినిమాకి రూ.55 కోట్ల వసూళ్లు దక్కాయి. మరి ఈ ఎవడు ఏం చేస్తాడో చూడాలి.