భారత్ కు పెద్ద గండం వచ్చిపడిందే..

సల్మాన్ – కత్రినా జంటగా అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం భారత్. టైగర్ జిందా హై తర్వాత వీరి కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా ఫై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ఈ సినిమాలో సల్మాన్‌ ఐదు విభిన్న గెటప్‌లలో కనిపించనున్నాడు. ఈద్‌ సందర్భంగా రేపు ఈ మూవీ వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున విడుదల కాబోతుంది. మొన్నటి వరకు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన అభిమానులకు పెద్ద గండం వచ్చి పడింది. అదే క్రికెట్ వరల్డ్ కప్.

మే 30 నుండి వరల్డ్ కప్ కప్ మ్యాచ్లు మొదలు అవ్వగా జూన్ 05 న అంటే రేపు ఇండియా – సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ఉండడం తో ఆ ఎఫెక్ట్ భారత్ సినిమా ఫై భారీగా పడనుంది. ఖచ్చితంగా ఈ మ్యాచ్ ఎఫెక్ట్ చిత్ర ఓపెనింగ్స్ ఫై పడతాయని నిర్మాతలు భయపడుతున్నారు. మరి భయం ఏ మేరకు ఉంటుంది..మ్యాచ్ ప్రభావం ఏ మేరకు పడుతుందనేది చూడాలి.

మన తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా ఫై భారీ అంచనాలే నెలకొని ఉండడం తో ఫ్యాన్సీ రేటుకు ఏషియన్ వారు హక్కులు దక్కించుకున్నారని తెలుస్తుంది. ఏపీ – తెలంగాణ కలిపి రూ.4-5 కోట్లు దక్కించుకున్నారు. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సల్మాన్ యాక్షన్ ఓ రేంజులో ఉండబోతోందని తెలుస్తోంది. పీరియాడిక్ డ్రామాలో సల్మాన్ ఓవైపు సర్కస్ వాలాగా.. దేశ భక్తుడైన నేవీ అధికారికగా రకరకాల షేడ్స్ లో కనిపించనున్నాడు.