ఎట్టకేలకు అనుమానాలన్నీ పటాపంచలైపోయాయి. ఎవడు ఎప్పుడొచ్చేది తెలిసిపోయేది. పవన్ కల్యాణ్కి భయపడి.. ఎవడు డేట్ వాయిదా వేస్తారని జరుగుతున్నప్రచారానికి పుల్స్టాప్ పడిపోయినట్టైంది. అయితే ఎవడుని ఈనెల 31న విడుదల చేయడం మినహా మరో మార్గం లేదు.. నిర్మాతలకు. ఎందుకంటే జంజీర్ సెప్టెంబరు 6న వచ్చేస్తోంది. ఎవడు – జంజీర్ల మధ్య కనీసం నెల రోజులైనా గ్యాప్ ఉండాలి. లేదంటే ఆ ప్రభావం రెండు సినిమాలపైనా పడుతుంది. అంతేకాదు… ఒకవేళ ఎవడు విడుదల వాయిదా వేస్తే… ప్రతికూల ప్రచారమే ఎక్కువగా జరుగుతుంది. అందుకే ఇక గత్యంతరం లేక అనుకొన్నట్టుగానే ఈనెల 31న ఈ సినిమా విడుదల చేయాలని ఫిక్సయ్యారు.
ఎవడు రిలీజ్ కన్ఫామ్ తరవాత మెగా అభిమానులకు మరో సందేహం వెంటాడుతోంది. ఒకవేళ ఎవడు దుమ్ముదులిపే స్థాయిలో వసూళ్లు సాధిస్తే… అత్తారింటికి వాయిదా వేస్తారా? అనే భయం ఉంది. చరణ్ భయపడకుండా ముందడుగు వేస్తుంటే..? పవన్ వెనక్కి తగ్గుతాడా? నోవే అంటున్నారు ఇంకొందరు. ఏం జరుగుతుందో చూడాలి.