Site icon TeluguMirchi.com

దుబాయ్ వెళ్ళనుంది

sruthi‘లక్’ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది శ్రుతిహసన్. కాని అక్కడ అంతగా లక్ కలసి రాలేదు. అయితే ‘గబ్బర్ సింగ్’ హిట్ తో టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ అయిపొయింది. ఇప్పుడు మరో సారి బాలీవుడ్ లక్ ను టెస్ట్ చేసుకోనుంది. దర్శకుడు అనీజ్ బజ్మీలో ‘వెల్ కమ్ బ్యాక్ ‘సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. ఈ సీక్వెల్ లో అక్షయ్ కుమార్ సరసన శృతిహాసన్ సందడి చేయనుంది. ఈ చిత్రం షూటింగ్ దుబాయ్ లో జరగుంది. ఇందుకోసం శ్రుతి దుబాయ్ వెళ్లనుంది. ఈ షెడ్యూల్ లో శ్రుతి హసన్ తో పాటు టాలీవుడ్ నవ్వుల కింగ్ బ్రహ్మానందం కూడా పాల్గొనున్నారు.

Exit mobile version