Site icon TeluguMirchi.com

మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న విరాట పర్వం

నీదీ నాదీ ఒకే కథ ఫేం వేణు ఊడుగుల దర్శకత్వంలో విరాట పర్వం 1992 అనే చిత్రం తెరకెక్కుతుంది. ఈ మూవీలో రానా హీరో గా నటిస్తుండగా , ఆయన సరసన సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తుంది. తాజాగా ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. కొన్ని రోజుల క్రితం తెలంగాణలోని ధరిపల్లి అనే గ్రామంలో ప్రారంభమైన ఈ మొదటి షెడ్యూల్ నిన్నటితో పూర్తి అయింది.

త్వరలోనే ఈ సినిమా రెండో షెడ్యూల్ మొదలుకానున్నట్లు తెలుస్తుంది. సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీత దర్శకుడు. ఈ మూవీ లో సాయి పల్లవి నక్సలైట్ గా ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లో కనిపించబోతుందని సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతుంది. ఈ వార్త ఫై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Exit mobile version