Site icon TeluguMirchi.com

ప్రేక్షకుల్ని ‘ఖుషి’ చేసేందుకు సిద్ధమవుతున్న విజయ్ దేవరకొండ, సమంత


విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ‘ఖుషి’ రిలీజ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. మరో 9 రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రాన్నిదర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించారు. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుందీ సినిమా. సెన్సార్ బృందం ‘ఖుషి’ మూవీకి యూఏ సర్టిఫికెట్ జారీ చేశారు. సెప్టెంబర్ 1న పాన్ ఇండియా స్థాయిలో థియేటర్స్ లో ‘ఖుషి’ గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

టైటిల్ నుంచి టీజర్, పాటలు, ట్రైలర్ తో అన్ని వర్గాల ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించిన సినిమా ‘ఖుషి’. విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్ తో పాటు.. లవ్, ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ రూపొందించడంలో దర్శకుడు శివ నిర్వాణ హిట్ ట్రాక్.. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ గ్రాండియర్.. ఇవన్నీకలిపి ‘ఖుషి’ మీద భారీ ఎక్స్ పెక్టేషన్స్ తీసుకొచ్చాయి. ఇక రీసెంట్ గా సెన్సార్ నుంచి వచ్చిన హిట్ టాక్ తో థియేటర్స్ లో ప్రేక్షకులు ఈ సినిమాతో ‘ఖుషి’ చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇకపోతే 165 నిమిషాల నిడివితో గల ‘ఖుషి’ మూవీకి యూఏ సర్టిఫికెట్ జారీ చేసింది సెన్సార్ బృందం. ఇప్పటిదాకా ఏ ఫిల్మ్ ఇండస్ట్రీలో అయినా బ్లాక్ బస్టర్ హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ రికార్డ్ చూస్తే అవన్నీ రెగ్యులర్ మూవీస్ కు కనీసం 20 నిమిషాల లెంగ్త్ ఎక్కువ ఉన్నవే. కథలో ప్రేక్షకులు లీనమైతే కాస్త ఎక్కువ లెంగ్త్ సమస్య కాదని గతంలో ఎన్నో బ్లాక్ బస్టర్స్ ప్రూవ్ చేశాయి. ‘ఖుషి’ ఔట్ పుట్ మీద టీమ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. ఇటీవల మ్యూజిక్ కన్సర్ట్ సూపర్ హిట్టయ్యింది. ఆడియెన్స్ లో కావాల్సినంత బజ్ ఏర్పడింది. ఇంకా అందరూ వెయిట్ చేస్తున్నది ‘ఖుషి’ ఫస్ట్ డే ఫస్ట్ షో కోసమే. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 1న ‘ఖుషి’ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మళయాల, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయబోతోన్నారు.

Exit mobile version