Site icon TeluguMirchi.com

విజయ్ దేవరకొండ, పరశురామ్ మూవీ లేటెస్ట్ అప్డేట్..


విజయ్ దేవరకొండ, పరశురామ్ కలిసి మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు సిద్దమైన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో రెండో సినిమాను ఈ మధ్యే ప్రారంభించారు. ఈ మూవీలో విజయ్ సరసన మృణాళ్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించనుంది. ఇకపోతే తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ వచ్చింది.

ఈ మూవీకి సంబంధించి USA లొకేషన్ల వేట పూర్తయింది. ఇక త్వరలోనే షూటింగ్ ప్రారంభించబోతోన్నామని ప్రకటించారు మేకర్స్. ఈ మేరకు చిత్రయూనిట్ ఓ ఫోటోను వదిలింది. ఇందులో టీం అంతా కూడా నవ్వులు చిందిస్తూ కనిపిస్తోంది. కాగా విజయ్ దేవరకొండ, మృణాళ్ ఠాకూర్ కాంబోలో రాబోతోన్న ఈ సినిమాను నిర్మాత దిల్ రాజు, శిరీష్‌లు నిర్మిస్తున్నారు. ఇక ఈ కాంబినేషన్ పై ఇప్పటికే అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే సినిమాను తెరకెక్కించబోతోన్నట్టుగా తెలుస్తోంది.

Exit mobile version