Site icon TeluguMirchi.com

ఆకట్టుకుంటున్న విజయ్ ‘ఖుషి’ ట్రైలర్ !


విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘ఖుషి’. పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమవుతున్న ఈ మూవీని దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఇటీవలే ఖుషి సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి, పాటలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రాగా, తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

‘దీనెమ్మ కాశ్మీర్, రోజా సినిమాలా వుంది’ అని విజయ్ దేవరకొండ చెప్పే డైలాగ్ తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఎమోషన్స్, రొమాన్స్, ఫన్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంటుంది. విజయ్, సమంత ల మధ్య కెమిస్ట్రీ చాలా బావుంటుంది. మొత్తానికి ట్రైలర్ చూస్తుంటే.. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని అర్థం అవుతోంది. హిషామ్ అబ్దుల్ వాహబ్ అందించిన పాటలు ఒకదానిని మించి మరొకటి చాలా అద్భుతంగా వున్నాయి. కాగా సెప్టెంబర్ 1న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మళయాల, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.

Exit mobile version