Site icon TeluguMirchi.com

రజినీ, అమితాబ్ లతో విద్యాబాలన్!

Vidya Balanబాలీవుడ్ నటి విద్యాబాలన్ కు అరుదైన అవకాశం లభించింది. అందంతో పాటు తన నటననైపుణ్యం తో బాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న విద్యాబాలన్.. ‘కేన్స్ ఫిలిం ఫెస్టివల్-2013’ జ్యూరీ మెంబర్‌గా ఎంపికయింది. డర్టీ పిక్చర్‌, ఖహాని చిత్రాలలో ఉత్తమ నటన కనబరచడం తో విద్యాకు ఈ అవకాశం లభించింది.  కేన్స్ జూర్యీలో హాలీవుడ్ దర్శకులు స్టీవెన్ స్పిల్ బర్గ్, లైఫ్ అఫ్ ఫై దర్శకుడు ఆంగ్ లీ, జపనీస్ దర్శకుడు నవోమి కవాసే, నటి, నిర్మాత నికోల్ కిడ్ మన్, స్కాటిష్ దర్శకుడు లిన్నే రమ్సే, ఫ్రెంచ్ నటుడు, దర్శకుడు డానియేల్, రుమేనియన్ దర్శకుడు క్రిస్టియన్ ముంగి, నటుడు క్రిస్ట్ఫో వాల్ట్జ్ మెంబర్లుగా ఉన్నారు. ఇప్పుడీ జాబితాలో విద్యాబాలన్ కూడా చేరింది. ఇక మే 15 నుంచి 26 వరకు జరిగే  కేన్స్ ఫిలిం ఫెస్టివల్ బిగ్ బి అమితాబ్ తో పాటు సూపర్ స్టార్ రజినీకాంత్ పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో జ్యూరీ మెంబర్‌గా ఎంపిక కావడంపై విద్యాబాలన్ ఆనందం వ్యక్తం చేస్తోంది.

Exit mobile version