వెంకీమామ లైన్ అదేనా..?

ప్రస్తుతం ఇండస్ట్రీ లో కథలు కరువయ్యాయి..అప్పుడెప్పుడో వచ్చిన సినిమాల కథలనే అటుఇటుగా చేంజ్ చేసి కొత్త కథగా తెరకెక్కిస్తున్నారు తప్ప సరికొత్త కథలు రాసే వారు మాత్రం చాల తక్కువ. ఇక కొత్త డైరెక్టర్లు మొదట్లో కొత్త కథలు రాసుకున్న తర్వాత వారు కూడా కాపీ కథలనే నమ్ముకుంటున్నారు. ఇక తాజాగా వెంకీ – చైతు కాంబినేషన్లో తెరకెక్కుతున్న వెంకీమామ లైన్ ఇదే అంటూ ఓ వార్త బయటకు వచ్చింది.

ఈ మూవీ కథ భాగవతం పురాణంలోని ఓ పాయింట్ ఆధారంగా చేసుకొని రాసుకున్నారని.. కోన వెంకట్, జనార్థన మహర్షి, డైరక్టర్ రవీంద్ర కలిసి ఈ కథ కోసం పనిచేశారని అంటున్నారు. సినిమా కథ ఏమోకానీ, పాయింట్ మాత్రం పురాణంలో కంసమామ టైపు ఉంటుందని గట్టిగా చెపుతున్నారు. కంసమామ, మేనల్లుడు కృష్ణుడి పాలిట విలన్. ఇక్కడ వెంకీ మామ అలా కాదు. కానీ రెండింటికీ కామన్ పాయింట్, మామకు అల్లుడి వల్ల గండం వుంటుంది అన్న జ్యోతిష్యం పాయింట్ అని తెలుస్తోంది. మరి నిజంగా ఆలా ఉంటుందా లేదా అనేది చూడాలి.

ప్రస్తుతం ఈ మూవీ తాజా షూటింగ్ వైజాగ్ లో మొదలు కాబోతుంది. రీసెంట్ గా కాశ్మీర్ షెడ్యూల్ పూర్తి చేసుకొని హైదరాబాద్ వచ్చిన చిత్ర యూనిట్..వైజాగ్ షెడ్యూల్ కోసం సిద్ధమవుతున్నారు. సురేష్ బాబు బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ లో రాశిఖన్నా , పాయల్ రాజ్ పూర్త హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.