వెంకటేష్, మహేష్ బాబు కలిసి నటించిన మల్టీ స్టారర్ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సంక్రాంతి కానుకగా విడుదలై అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘మిక్కి’ బాణీలు, మణి శర్మ నేపధ్య సంగీతం హైలెట్ గా నిలిచాయి. ఈ సంధర్బంగా ఈ చిత్ర ప్లాటినం డిస్క్ వేడుక ఆదివారం సాయంత్రం శిల్ప కళా వేదికలో అట్టహాసంగా జరిగింది.ఈ వేడుకలో వెంకటేష్ మాట్లాడుతూ…‘నిజ జీవితంలో నేనొక అన్నకి తమ్ముడిని. కానీ నాకు తమ్ముడు లేడు. ఈ సినిమా వల్ల నాకొక తమ్ముడు దొరికాడు’ అన్నారు. ఈ వేడుకలో మూవీ మొఘల్ డా.డి.రామానాయుడు, సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల, మహేశ్ బాబు, నమృతా, వెంకటేశ్, సమంతా, గీత రచయితలు సిరివెన్నెల, అనంత శ్రీరాం, శ్రీకాంత్ అడ్డాల, చిత్ర తారాగణం, సాంకేతిక వర్గం, నిర్మాతలు తదితరులు పాల్గొన్నారు.