54 సెంటర్లలో ఆఫ్ సెంచరీ కొట్టిన బాలకృష్ణ !


నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వీరసింహారెడ్డి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13 న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. పర్ఫెక్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా బాలయ్య కెరీర్ లోనే మంచి కలక్షన్స్ అందుకున్నసినిమాగా వీరసింహారెడ్డి గుర్తింపు తెచ్చుకుంది. ఇక తాజగా ఈ సినిమా మరో రికార్డును సొంతం చేసుకుంది ఈ సినిమా మొత్తం 54 సెంటర్లలో ఆఫ్ సెంచరీ పూర్తి చేసి అందరినీ అలరించింది. ఇప్పటి సినిమాలు రెండు వారాల కంటే ఎక్కువ థియేటర్ లో ఆడడం లేదు. అలాంటిది.. 54 సెంటర్లలో 50 రోజులు పూర్తిచేసుకోవడం అంటే మాటలు కాదు. దీంతో నందమూరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అది బాలయ్య రేంజ్ అంటే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. మరి హాఫ్ సెంచరీతో వీరసింహ ఆగుతుందో సెంచరీ వరకు వెళ్తుందో చూడాలి.