డబ్బు చుట్టూ తిరిగే ‘వసూల్ రాజా’

vasool-raja“ఈ ప్రపంచమంతా ‘మనీ’ చుట్టూనే తిరుగుతోంది. మా సినిమా కూడా మనీ చుట్టూనే తిరుగుతుంది. ఇందులోని ప్రతి పాత్ర డబ్బు కోసం ఆలోచిస్తూ ఉంటుంది. ఈ డబ్బు వెంపర్లాట అంతా చాలా వినోదాత్మకంగా ఉంటుంది. ఇందులో దొంగగా నవదీప్, పోలీస్ గా శ్రీహరి చేశారు. వీరిద్దరి అనుబంధమే ఈ సినిమాకు కీలకం” అని దర్శకుడు కార్తికేయ గోపాలకృష్ణ చెప్పారు. నవదీప్, శ్రీహరి, రీతూబర్మేచా కాంబినేషన్ లో బి.ఎమ్. స్టూడియోస్ పతాకంపై బత్తుల రతన్ పాండు, మహంకాళి దివాకర్ నిర్మిస్తున్న చిత్రం ‘వసూల్ రాజా’. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం రీ-రికార్డింగ్ దశలో ఉంది.

నిర్మాతలు మాట్లాడుతూ – “ఇది పక్కా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్. బ్రహ్మానందం ఎపిసోడ్ ఈ సినిమాకే మెయిన్ హైలైట్. ఇటీవల విడులైన పాటలకు మంచి ఆదరణ లభిస్తోంది. చిత్రీకరణ కూడా చాలా బాగా వచ్చింది. ఈ నెల ద్వితీయార్థంలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం” అని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు : రామస్వామి, సంగీతం : చిన్ని చరణ్, కెమెరా : కృష్ణ ప్రసాద్.