నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ సినిమా ఎప్పుడు? ఎవరితో?? అనేది ఇంకా సందిగ్థంలోనే ఉంది. శ్రీకాంత్ అడ్డాలతో ఎంట్రీ చేయిద్దాం అనుకొన్నారు. కానీ కుదర్లేదు. ఆ తరవాత పూరి జగన్నాథ్ పేరు వినిపించింది. చివరికి క్రిష్ దగ్గరకూ వెళ్లింది. ప్రస్తుతం క్రిష్ బాలీవుడ్కి వెళ్లాడు. అక్కడ ఠాగూర్ని రీమేక్ చేస్తున్నాడు. అందుకే క్రిష్తో జత కట్టడం కుదర్లేదు. అందుకే ఇప్పుడు శేఖర్ కమ్ముల చేతిల్లోకి వెళ్లింది ఈ సినిమా. కొత్తవారితో అద్భుతాలు సృష్టించగల నేర్పరి శేఖర్ కమ్ముల. ఇప్పుడు ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్, లీడర్ ఇవన్నీ కొత్తవారితో తీసినవే. ఇప్పుడు నయనతారని అనామిక గా చూపిస్తున్నారు. నాగబాబు తన తనయుడికి ఈ దర్శకుడికి అప్పగించినట్టు సమాచారమ్. లీడర్లా ఓ సామాజిక అంశాన్ని ఇతివృత్తంగా తీసుకొని అందులోనే హీరోయిజం చూపించేలా శేఖర్ ప్రయత్నిస్తున్నారట. ఈ చిత్రానికి అశ్వనీదత్ నిర్మాతగా వ్యవహరిస్తారు. ఈసారి ఎలాంటి ఆలస్యం చేయకుండా ఈ సినిమాకి సెట్స్పైకి తీసుకెళ్లాలని నాగబాబు భావిస్తున్నారట. చూద్దాం, ఏమవుతుందో..?