శ్రీకాంత్ అడ్డాల, పూరి జగన్నాథ్, క్రిష్ – ఇలా తన తనయుడిని ఎవరి చేతుల్లో పెట్టాలో అర్థం కాక తికమకపడ్డాడు నాగబాబు. ఇప్పుడు ఆ దర్శకుడు ఎవరో తేలిపోయింది. క్రిష్ చేతుల మీదుగా తన తనయుడిని తెరపైకి తీసుకురావాలని ఆయన డిసైడ్ అయ్యారు. క్రిష్ కూడా అందుకు పచ్చజెండా ఊపడంతో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోంది. లైన్ ఇప్పటికే సిద్ధమైందట. అందుకే ఆగస్టు లో ఈ సినిమాకి కొబ్బరికాయ కొట్టేయబోతున్నారు. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వనీదత్ ఈ సినిమాని నిర్మిస్తారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిచనున్నారు.