‘వాల్మీకి’పై సాహో ఎఫెక్ట్‌

తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన జిగర్తాండ చిత్రంను తెలుగులో ‘వాల్మీకి’గా రీమేక్‌ చేస్తున్న విషయం తెల్సిందే. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వరుణ్‌ తేజ్‌ విలన్‌ గా కనిపించబోతున్నాడు. భారీ అంచనాలున్న ఈ చిత్రంను మొన్నటి వరకు సెప్టెంబర్‌ 13న విడుదల చేయాలని భావించారు. అయితే సెప్టెంబర్‌ 13న గ్యాంగ్‌ లీడర్‌ వచ్చి పడింది. గ్యాంగ్‌ లీడర్‌ చిత్రాన్ని ఈనెల ఆగస్టు 30న అనుకున్నారు. సాహో విడుదల వాయిదా పడి ఆగస్టు 30న రాబోతుంది.

సాహో విడుదల వాయిదా పడటంతో గ్యాంగ్‌ లీడర్‌ సినిమా విడుదల వాయిదా పడింది. గ్యాంగ్‌ లీడర్‌కు బెర్త్‌ కన్ఫర్మ్‌ చేసేందుకు ఇప్పుడు వాల్మీకి సినిమా కూడా విడుదల వాయిదా వేయాల్సి వచ్చింది. సెప్టెంబర్‌ 13న కాకుండా వారం రోజులు ఆలస్యంగా సెప్టెంబర్‌ 20వ తారీకున ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని నిర్ణయించుకున్నారు. పోటీ లేకుండా సోలోగా వచ్చే ఉద్దేశ్యంతో గ్యాంగ్‌ లీడర్‌కు సైడ్‌ ఇచ్చినట్లుగా కూడా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా అధర్వ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.