వరుణ్ తేజ్ ‘గాంఢీవధారి అర్జున’ షూటింగ్ పూర్తి..


వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనదైన గుర్తింపు సంపాదించుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరోసారి తనదైన శైలిలో మరో డిఫరెంట్ మూవీతో మన ముందుకు రాబోతున్నారు. ఆ సినిమాయే ‘గాంఢీవధారి అర్జున’. స్టైలిష్ ఫిల్మ్ మేక‌ర్ ప్ర‌వీణ్ సత్తారు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న‌ ఈ చిత్రంలో వ‌రుణ్ తేజ్ ప‌క్కా యాక్ష‌న్ మోడ్‌లో ఆక‌ట్టుకోబోతున్నారు. సాక్షి వైద్య హీరోయిన్‌గా న‌టిస్తుంది. వ‌రుణ్‌తేజ్ కెరీర్‌లో అత్యంత భారీ చిత్రంగా.. యూరోపియ‌న్ దేశాల‌తో పాటు యు.ఎస్‌.ఎలోనూ షూటింగ్‌ను హ్యూజ్ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా ఎంటైర్ షూటింగ్ పూర్త‌య్యింది.

ఈ సందర్భంగా ‘గాంఢీవధారి అర్జున’ షూటింగ్ పూర్త‌యిన విష‌యాన్ని తెలియ‌జేస్తూ మేకర్స్ ఓ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఇందులో వ‌రుణ్ తేజ్ చాలా స్టైలిష్‌గా క‌నిపిస్తున్నారు. చేతిలో గ‌న్ ప‌ట్టుకుని నిలుచుని ఉన్నారు. వ‌రుణ్‌తేజ్ ఈ చిత్రంలో సెక్యూరిటీ ఆఫీస‌ర్‌గా క‌నిపిస్తారు. మిక్కీ జె.మేయ‌ర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఎస్వీసీసీ ప‌తాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌, బాపినీడు నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 25న ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను గ్రాండ్ లెవ‌ల్లో విడుద‌ల చేస్తున్నారు.