ప‌వ‌న్ క‌ళ్లలో నిజాయ‌తీ చూశాడ‌ట‌!

Ram-gopal-varmanప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల్ని త‌న వ్యాఖ్యల‌తో అల‌రించ‌డం మానుకోలేక‌పోతున్నాడు రాంగోపాల్ వ‌ర్మ‌. ట్విట్టర్ తెరిస్తే చాలు అందులో ప‌వ‌న్ భ‌జ‌న మాత్రమే క‌నిపిస్తోంది. మైకు ముందుకు వ‌చ్చినా ఆ మాట‌లే! ప‌వ‌న్ రాజ‌కీయ రంగ ప్రవేశం గురించి మ‌రోసారి మాట్లాడాడు ఈ సంచ‌ల‌న ద‌ర్శకుడు. ”ప‌వన్ రాజ‌కీయాల్లోకి వ‌స్తే బాగుంటుంది అనేది నా వ్యక్తిగ‌త అభిప్రాయం. రావ‌డం, రాకపోవ‌డం ఆయ‌నిష్టం. వ‌స్తే.. స‌మాజానికి మంచి జ‌రుగుతుంది. ఎందుకంటే ఆయ‌న క‌ళ్లలో నిజాయ‌తీ చూశాను” అంటున్నాడు వ‌ర్మ‌. కానీ తాను మాత్రం రాజ‌కీయాల్లోకి రాడ‌ట‌. ”ప‌వ‌న్‌లాంటివాళ్లు వ‌స్తే.. జ‌నం ఓట్లు వేస్తారేమో? నేనొస్తే క‌చ్చితంగా రాళ్లతో కొడ‌తారు…” అంటున్నాడు.