తొలిప్రేమ , ఎఫ్ 2 చిత్రాల హిట్ తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న చిత్రం వాల్మీకి. తమిళ చిత్రం ‘జిగర్తాండ’కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తుండగా..పూజా హగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం షూటింగ్ అంత పూర్తి చేసుకున్న ఈ మూవీ ఈ నెల 20 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ తరుణంలో ఈ చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేసి సినిమా ఫై ఆసక్తి నింపారు హరీష్. ట్రైలర్ విషయానికి వస్తే..‘ఈ మధ్యకాలంలో ఇంటిల్లిపాదీ కూర్చునే సినిమాలు ఎక్కడొస్తున్నాయి?’ అందుకే ఈ సినిమాతో నిరూపిస్తా అనే డైలాగ్ తో ట్రైలర్ స్టార్ట్ అయ్యింది.
‘ఫామ్ హౌస్లో ఉన్న డాన్కి కాదు.. ఫామ్లో ఉన్న డాన్ని పట్టుకునే కథే ఈ వాల్మీకి. ఓ మంచి సినిమా తీయాలనుకునే యువ దర్శకుడు ‘వాల్మీకి’ని ఎలా చూపించాడన్నదే ఈ సినిమా నేపథ్యం. ‘నాపైన పందేలు వేస్తే గెలుస్తారు.. నాతోటి పందేలేస్తే చస్తరు.. గద్దల కొండ గణేష్ అంటే గజ గజ గజ వణకాలి అంటూ తెలంగాణ యాసలో చెప్తున్న డైలాగ్ అతని పాత్రకు యాప్ట్ అయ్యేట్టుగా ఉంది. ఏమ్ రోయ్.. మనం బతుకున్నమని పదిమందికి తెల్వకపోతే.. మనం బతుకుడెందుకురా? అని క్రూరంగా నవ్వుతూ వరుణ్ చెప్పే డైలాగ్ ట్రైలర్కి హైలైట్గా ఉంది. ఇందులో వరుణ్ తేజ్ను గద్దల కొండ గణేష్గా ఉగ్రరూపంలో చూపించగా.. సినీ రచయితగా మరో డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించారు. కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ నుంచి సినీ రచయితగా మారిన వ్యక్తి పాత్రలో వరుణ్ మెస్మరైజ్ చేస్తున్నాడు.
హరీష్ శంకర్ టేకింగ్కి చోటా కె ప్రసాద్ సినిమాటోగ్రఫీ జోడి కుదిరింది. అలాగే మిక్కే జె మేయర్ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా హైలైట్ గా ఉండడంతో ట్రైలర్ ఆకట్టుకుంది. ఇక సినిమా ఎలా ఉండబోతుంది అనేది చూడాలి. ఈ లోపు ఈ ట్రైలర్ ఫై లుక్ వెయ్యండి.