Site icon TeluguMirchi.com

గద్దలకొండకు కర్నూల్‌లో చేదు  అనుభవం

హరీష్‌శంకర్‌ తెరకెక్కించిన ‘గద్దలకొండ గణేష్‌’ చిత్రం సెప్టెంబర్‌ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో వరుణ్‌ తేజ్‌, పూజాహెగ్డేలు జంటగా నటించారు. అయితే ఈ చిత్రానికి మొదటగా ‘వాల్మీకి’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. కొన్ని సామాజిక సంఘాల వారు టైటిల్‌ విషయమై కోర్టును ఆశ్రయించారు. ఆ టైటిల్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. దాంతో కోర్టు కూడా టైటిల్‌ని మార్చాలని తీర్పునిచ్చింది. అయితే విడుదల రేపు అనగా చిత్ర యూనిట్‌ ఈ సినిమా టైటిల్‌ని ‘గద్దలకొండ గణేష్‌’గా ఫిక్స్‌ చేసింది. దాంతో ఏ గొడవ లేకుండా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం విడుదలకు సిద్దమయ్యింది. కాగా కర్నూల్‌లో మాత్రం గద్దలకొండకు చేదు అనుభవం ఎదురయింది.

ఏపీ హైకోర్టు నుండి తమకు ఏ ఆదేశాలు రాలేదని, కోర్టు ఆదేశాలు వచ్చాకే సినిమా విడుదలకు అనుమతిస్తాం అంటూ కర్నూలు కలెక్టర్‌ తేల్చి చెప్పారు. దాంతో కర్నూల్‌లో ‘గద్దలకొండ గణేష్‌’ విడుదల కాలేదు. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం ‘జిగర్తాండ’ అనే తమిళ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కింది.

Exit mobile version