వరుణ్ తేజ్ – పూజా హగ్దే – అధర్వ మురళీ ప్రధాన పాత్రల్లో గబ్బర్ సింగ్ ఫేమ్ హరీష్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రం వాల్మీకి. కోలీవుడ్లో సూపర్ హిట్ అయిన జిగర్తాండ సినిమాను తెలుగులో వాల్మీకి పేరుతో రీమేక్ చేస్తున్నారు.
ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం తాలూకా డబ్బింగ్ పనులు మొదలు పెట్టారు. దర్శకుడు హరీష్ శంకర్ యాక్టర్ బ్రహ్మజీ తో డబ్బింగ్ థియేటర్లో కలిసి దిగిన ఫోటో ఒకటి ట్విట్టర్ లోపోస్ట్ చేసి “మా కొత్త యాక్టింగ్ టీచర్ బ్రహ్మజీ…ముని మాణిక్యంగా, డబ్బింగ్ స్టార్ట్….” అని కామెంట్ కూడా పెట్టారు. హీరో వరుణ్ తేజ్ పక్కన ఉండే ముని మాణిక్యం అనే ఓ కీలకపాత్రలో బ్రహ్మజీ నటిస్తున్నట్లు తెలుస్తుంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Our new Acting Teacher is in Town …….. @actorbrahmaji as
“Muni Manikyam….”
Dubbing started ……. pic.twitter.com/mj0AwSHLAj— Harish Shankar .S (@harish2you) 17 August 2019