దర్శకులు నిర్మాతలుగా మారడం మామూలే. కోలీవుడ్ లో ఐతే శంకర్, గౌతమ్ మీనన్ లాంటి దర్శకులు తమ అభిరుచికి తగ్గట్టు సినిమాలు నిర్మిస్తుంటారు. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ కూడా నిర్మాణం వైపు అడుగులు వేస్తున్నారు. ఆయనకెప్పటి నుంచో తక్కువ బడ్జెట్లో, ఓ వినూత్నమైన ప్రేమకథ తీయాలని ఉంది. దాన్ని బయటి నిర్మాతలతో తీయడం కంటే, సొంత బ్యానర్లో చేయడం బెటర్ అన్నది ఆయన అభిప్రాయం.
‘కొత్తగా ఆలోచించి సినిమాలు చేయాలని ఉంటుంది. నేనూ నాలుగేళ్లుగా అదే ఆలోచనలో ఉన్నాను. కానీ మన టేస్టు మరో నిర్మాతపై బలవంతంగా రుద్దకూడదు కదా.. అందుకే ఆ సినిమా సెట్స్పైకి వెళ్లలేదు. రాబోయే రెండేళ్లలో అలాంటి సినిమా నా నుంచి తప్పకుండా ఆశించొచ్చు” అని చెప్పుకొచ్చారు వినాయక్.