ఉప్పెన అప్డేట్ ..

సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా ‘ఉప్పెన‌’ టైటిల్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సుకుమార్ శిష్యుడు బుచ్సిబాబు ఈ సినిమా తో డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వైష్ణవతేజ్ సరసన హీరోయిన్ గా మంగుళూరు భామ కృతి శెట్టి నటిస్తుంది. తమిళ్ , కన్నడ మూవీస్ తో ఆకట్టుకున్న ఈ భామ తెలుగు లో మొదటిసారి నటించబోతుంది.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ కాకినాడలో జరుగుతోంది. రీసెంట్ గా మొదలైన ఈ షెడ్యూల్‌ మరో 30 రోజులు అక్కడే కొనసాగుతుంది. ఆ తర్వాత గ్యాంగ్‌టాక్, సిక్కిం ప్రాంతాల్లో 20 రోజుల పాటు చిత్రీకరణ జరుగుతుంది. అక్కడి నుంచి తిరిగొచ్చిన తర్వాత హైదరాబాద్‌లో షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తారు. ఇక్కడ ఓ 20 రోజులు షూటింగ్‌ చేయనున్నారు. దాంతో ఈ సినిమా షూటింగ్‌ మొత్తం పూర్తీ అవుతుందని చిత్ర యూనిట్ చెపుతున్నారు.

ఈ మూవీ లో వైష్ణవ్ తేజ్ రెగ్యులర్ గా యూత్ సినిమాల్లో కనిపించే కాలేజీ స్టూడెంట్ లాగా కాకుండా కోస్తా ప్రాంతంలో నివసించే బెస్తవాడిగా కనిపించబోతున్నాడని అంటున్నారు. ప్రేమకథ బ్యాక్ డ్రాప్ లో సాగుతూనే చాలా ఇంటెన్సిటీ ఉన్న లవ్ స్టోరీ గా తెరకెక్కిస్తున్నారట. కోలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు విజ‌య్ సేతుప‌తి ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. దేవిశ్రీప్ర‌సాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండ‌గా.. శ్యామ్ ద‌త్ సైనుద్దీన్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.