Site icon TeluguMirchi.com

‘సైరా’పై ప్రత్యేక శ్రద్ద పెట్టిన ఉపాసన

మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ అక్టోబర్‌ 2వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రంను సింపుల్‌గా తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, మలయాళంలో కూడా విడుదల చేసే ఉద్దేశ్యంతో చిత్ర యూనిట్‌ సభ్యులు ఉన్నారు. ఇంకా చిత్రం విడుదలకు రెండు నెలల సమయం కూడా లేదు. అందుకే ప్రమోషన్‌ కార్యక్రమాలను మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం అందుతోంది.

సైరా చిత్రంను రామ్‌ చరణ్‌ నిర్మిస్తున్న విషయం తెల్సిందే. అందుకే సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలను స్వయంగా ఉపాసన దగ్గరుండి మరీ చూసుకోవాలని నిర్ణయించుకుంది. చరణ్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ఉపాసన సైరా ప్రమోషన్‌ బాధ్యతలను నెత్తిన వేసుకుంది. త్వరలోనే ఒక టీంను ఏర్పాటు చేసి మరీ ప్రమోషన్స్‌ను మొదలు పెట్టబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. తాను అడుగు పెట్టిన ప్రతి రంగంలో కూడా సక్సెస్‌ను సాధించే ఉపాసన ఈ చిత్రంకు నిర్మాణ బాధ్యతలు చూసుకోవడంతో పాటు ప్రమోషన్స్‌ కార్యక్రమాలను కూడా చూసుకోబోతుంది. కనుక సైరా సూపర్‌ హిట్‌ ఖాయం అంటూ మెగా ఫ్యాన్స్‌ ధీమాగా ఉన్నట్లుగా తెలుస్తోంది.

Exit mobile version