నటుడుగానే కాదు, దర్శకుడిగాను తన మార్కు చాటు కున్నారు ప్రకాష్రాజ్. ఆయన తొలిసారిగా మెగాఫోన్ పట్టిన ‘ధోనీ’ చిత్రానికి విమర్శకుల ప్రసంశలు దక్కాయి. ఇప్పుడు ‘ఉలవచారు బిరియానీ’ని రుచి చూపించబోతున్నారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రమిది. స్నేహ హీరోయిన్ గా నటించిది. కె.ఎస్.రామారావు నిర్మాత. తాజాగా చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి క్లిన్ ‘యు’ సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ సినిమాతో తేజ్, సంయుక్త హీరో హీరోయిన్ గా పరిచయమవుతున్నారు. చిత్రానికి మ్యాస్ట్రో ఇళయరాజా అందించారు. జూన్ 6 చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నహాలు చేస్తున్నారు.