శిరీష్ కు క్లీన్ ‘యు’ సర్టిఫికేట్

allu-sirish-gowravamఅల్లు శిరీష్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘గౌరవం’. యామీ గౌతం హీరోయిన్. రాధా మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఈ రోజు సెన్సార్ పూర్తి చేసుకుంది. గౌరవానికి సెన్సార్ బోర్డు వారు క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ సందర్భంగా గౌరవం చిత్రం గురించి శిరీష్ మాట్లాడుతూ.. ప్రేమ, సెంటిమెంట్, వినోదం కలిసిన ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయం కావడం సంతోషంగా ఉందని, చిత్రం కచ్చితంగా విజయాన్ని ఇస్తుందని శిరీష్ ఆశిస్తున్నారు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ చిత్రాన్ని డ్యూయట్ మూవీస్ పతాకంపై తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నిర్మిస్తున్నారు.