కథ మారిందా.. !!

allu-arjun-and-trivikram
బన్నీ-త్రివిక్రమ్ కాంభినేషన్ లో ఓ మూవీ మొదలైన విషయం తెలిసిందే. కొబ్బరికాయ కూడా కొట్టేశారు. ఇప్పటికే రెగ్యులర్ షూటింగును ప్రారంభించుకోవలసి వుంది. అయితే, ఈ మూవీ మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ఇందుకు కారణం కథ మారడమేనని ఫిల్మ్ నగర్ సమాచారమ్. త్రివిక్రమ్ కొత్త కథపై కసరత్తు చేస్తున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. బన్నీకి జంటగా సమంత జత కట్టనుంది. వచ్చే నెల 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ నిర్వహించినున్నట్లు తాజా సమాచారమ్. ఈలోగా బన్నీ ‘రుద్రమదేవి’ షూటింగును పూర్తి చేసుకోనున్నాడు.