తాజాగా కమల్హాసన్ సరసన మరోసారి నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. కమల్హాసన్ కథానాయకుడిగా నటిస్తూ స్వీయ నిర్మాణంలో ఓ యాక్షన్, థ్రిల్లర్ చిత్రాన్ని రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జేమ్స్బాండ్ తరహాలో సాగే ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో త్రిష కథానాయికగా ఎంపికైంది. మే నెలాఖరున ఈ సినిమా సెట్స్పైకి రానుంది. కమల్హాసన్ సరసన రెండోసారి నటించే అవకాశం రావడం పట్ల త్రిష ఆనందం వ్యక్తం చేసింది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మన్నధన్అంబు (తెలుగులో మన్మథబాణం) పెద్ద విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే.
అంతే కాకుండా పవన్ కళ్యాణ్ సరసన గబ్బర్ సింగ్ 2 లో సెకండ్ హీరొయిన్ గా నటించాబోతుందని సమాచారం. ప్రస్తుతం తెలుగు లో బాలకృష్ణ సరసన లయన్ అనే చిత్రం లో నటించగా ఈ చిత్రం మే 1 న విడుదలకు సిద్దంగా ఉంది.