తనదైన నటన, గ్లామర్ తో సౌత్ ని ఇట్టే పడేసిన హీరోయిన్ త్రిష. ఓ రేంజ్ ఆఫర్స్ సొంతం చేసుకొని సౌత్ లో ఓ వెలుగు వెలిగిన త్రిష ఇప్పుడు స్లో అయ్యింది.టాలీవుడ్, కోళీవుడ్ ఇండస్ట్రీలో దశాబ్దం పాటు తన నటనతో అభిమానులను అలరించిన త్రిషకు, ఇప్పుడు ఆఫర్లు అంతంత మాత్రంగానే వస్తున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే త్రిషను ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు దాదాపుగా మరచిపోయారనే చెప్పాలి. అయితే, సరైన ఆఫర్లు లేక రెమ్యునరేషన్ తగ్గించుకున్న త్రిష కు క్రికెట్ రూపంలో ఇప్పుడు ఓ మంచి ఛాన్స్ దక్కింది. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ చెన్నై రైనోస్ ఫ్రాంచైజీకి బ్రాండ్ అంబాసిడర్గా త్రిష ఎంపికైంది. చెన్నై రైనోస్కి త్రిష ను బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక చేసినట్లు యాజమాన్యం ప్రకటించింది. త్రిష రాకతో తమ జట్టుకు మరింత ఇమేజ్ వస్తుందని యాజమాన్యం చెబుతోంది. ఇక మూడో ఎడిషన్ పోటీల్లో ‘చెన్నై రైనోస్’ జట్టుకి కి శ్రుతిహసన్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించింది. ఈ ఎడిషన్ లో కూడా శ్రుతినే బ్రాండ్ అంబాసిడర్ కొనసాగుతుందనుకున్నరంతా. కాని నిర్వాహకులు పెద్దగా ఫాం లోని త్రిషను ఎంపికచేసి అందరికి సడన్ ట్విస్ట్ ఇచ్చారు.