రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న త్రిష..?

trisha-jayaవర్షం చిత్రం తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన త్రిష..అతి తక్కువ కాలంలోనే చిరు, వెంకటేష్, నాగ్ , పవన్ , మహేష్ , ఎన్టీఆర్ వంటి అగ్ర హీరోల సరసన నటించే అవకాశం పొందింది. ఈ మద్య తెలుగు లో కాస్త సినిమాలు తక్కువయినా తమిళ్ లో మాత్రం బిజీ హీరోయిన్ గా చెలామణి అవుతుంది..

తాజాగా ఈ ముద్దు గుమ్మ రాజకీయాల్లోకి అడుగుపెడుతుందని కోలీవుడ్ లో జోరుగా ప్రచారం జరగుతుంది..తమిళనాడు సీఎం జయలలిత నేతృత్వంలోని అన్నా డీఎంకేలో ఆమె చేరనుందన్న తమిళ చలనచిత్ర రంగంలో ఈ వార్త జోరందుకుంది. సినీ రంగం నుండి రాజకీయాల్లోకి అడుగు పెట్టి మంచి పేరు తెచుకుంటున్న హీరోయిన్స్ లేకపోలేదు, ఉదాహరణకు కుష్బూ, విజయశాంతి, జయసుధ, జయప్రద, రోజా తదితరులు రాజకీయాల్లో రాణిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. వీరి బాటలోనే త్రిష కూడా రాజకీయాల్లో చేరనున్నారన్న ప్రచారం జరుగుతుంది. ఇది అధికారికంగా ప్రకటన చేయకపోయేనప్పటికి ఇది నిజం అని మాత్రం బాగా తెలుస్తుంది..చూద్దాం త్రిష దీనికి ఏ సమాధానం చెపుతుందో…