త్రిష మూడు పూర్తి చేసింది..

Trisha-mudu

ఇండస్ట్రీ కి పరిచయమై దశాబ్ద కాలం అయినా కానీ త్రిష గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదు..ఇండస్ట్రీ కి కొత్త భామలు ఎంతమంది ఎంట్రీ ఇచ్చిన కానీ త్రిష హావ మాత్రం కొనసాగిస్తూనే ఉంది..ఇటీవల లేడి ఓరియంటెడ్..హర్రర్ చిత్రాల్లో నటిస్తున్న ఈ భామ , తాజాగా మూడు నెలల నుండి కాస్త కూడా రెస్ట్ తీసుకోకుండా మూడు సినిమాలను పూర్తి చేసింది.

Trisha-3movies

తాజాగా ‘మోహిని, శతురంగ వెట్టై, గర్జానై’ వంటి మూడు సినిమాల్ని ఒకేసారి పూర్తి చేసింది. వీటిలో ‘గర్జానై’ బాలీవుడ్ చిత్రం ‘ఎన్హెచ్ 10’ కు రీమేక్ కాగా ఈ థ్రిల్లర్ ను సుందర్ బాలు డైరెక్ట్ చేశారు. అలాగే నిర్మల్ కుమార్ డైరెక్ట్ చేసిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘శతురంగ వెట్టై’ లో త్రిష అరవింద స్వామితో కలిసి నటించారు. ఇక మూడో సినిమా ‘మోహిని’ హర్రర్ జానర్లో రూపొందింది. ఇలా మూడు విభిన్న తరహా సినిమాల్ని ఒకేసారి కంప్లీట్ చేసిన త్రిష , తమిళంలో ‘1818, 96’ మలయాళంలో ‘హే జూడ్’ వంటి మరో మూడు సినిమాల్లో నటిస్తూ బిజీ గా కెరియర్ సాగిస్తుంది.