చెన్నై చిన్నది త్రిష ఇప్పుడు చిక్కుల్లో పడింది. కోర్టు వ్యవహారాలతో త్రిషకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. కొన్నేళ్ల క్రితం త్రిష స్నానాలగదిలో ఉన్న క్లిప్పింగ్స్ నెట్ ప్రపంచంలో సంచలనం సృష్టించాయి. ఈ వీడియోలోని కొన్ని దృశ్యాలను ఓ ప్రముఖ పత్రిక ప్రచురించింది. అవి చూసి త్రిష అగ్గిలం మీద గుగ్గిలం అయిపోయింది. తన పరువుపోయిందంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. త్రిష పిటీషన్ స్వీకరించిన కోర్టు.. ఈ కేసులు పలు దఫాలుగా విచారించింది. ఏ వాయిదాకీ త్రిష రాలేదు. కనీసం ఆ విషయాన్ని కోర్టుకు కూడా చెప్పలేదు. దాంతో న్యాయస్థానం త్రిషపై సీరియస్ అయ్యింది. తరుపరి విచారణకు హాజరు కాకపోతే… ఈసారి అరెస్ట్ చేయాల్సివుంటుందని హెచ్చరించింది. దాంతో త్రిష తొలిసారి కోర్టు మెట్లు ఎక్కబోతోంది.