సినిమాల్లేక పోయినా త్రిష ఖాళీగా ఏం లేదు. స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొంటోంది. చేతికి అందిన వాణిజ్య ప్రకటనలు ఒప్పుకొంటోంది. ఇప్పుడామెకు కొత్త ఎండార్స్ మెంట్ ఒకటి చేరింది. ఒక ప్రముఖ విదేశీ ఐస్ క్రీమ్ కంపెనీకి ప్రచార కర్తగా వ్యవహరించబోతోంది. దీని ద్వారా వచ్చిన ఆదాయంలో కొంత భాగం పెటా సంస్థ కు కేటాయించాలని అమ్మడు భావిస్తోందట. `నాకు ఇష్టమైన ఐస్ క్రీమ్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించడం ఆనందంగా ఉంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రకటనల్లు తెరకెక్కిస్తారు` అని చెబుతోంది. సినిమాల గురించి మాట్లాడుతూ `దక్షిణాదిన నాకింకా అవకాశాలొస్తున్నాయి. అయితే.. వచ్చిన ప్రతి సినిమా చేయాలని రూలేం లేదు కదా? నాకు నచ్చినవి మాత్రమే చేస్తున్నా` అంటోంది.