Site icon TeluguMirchi.com

చిత్రసీమ షాక్‌

adపైర‌సీ త‌న విశ్వరూపాన్ని చూపించింది. ఇంత వ‌ర‌కూ విడుద‌ల రోజునే సినిమా బ‌య‌ట‌కు వ‌చ్చేది. ఇప్పుడు సినిమా విడుద‌ల కాక‌మునుపే … సిడీలు రోడ్లమీద పెట్టి అమ్మేస్తారేమో..? పైర‌సీ దారుడంటే చిత్రసీమ బ‌య‌ట ఉండేవాడు కాదు, ఇంట్లో ఉంటూనే… నిప్పంటించేవాడు అనే విష‌యాన్ని ప‌రిశ్రమ ఇప్పటికైనా గుర్తిస్తే మంచిది. అత్తారింటికి దారేది లీకేజ్‌… ప్రివ్యూ థియేట‌ర్ నుంచే సాగింద‌నే టాక్ వినిపిస్తోంది. ట్యూబ్ సిస్టమ్‌కి ఎక్కిన త‌ర‌వాతే… ఈ సినిమా పైర‌సీ చేశార‌ని చెప్పుకొంటున్నారు. టీమ్‌లో ప‌నిచేసిన వ్యక్తే పైర‌సీకి పాల్పడ్డాడ‌ని టాక్‌. ఆ వ్యక్తి ఎవ‌రో తెలుసుకొనే ప్రయ‌త్నాల్లో ఉంది చిత్రబృందం.

మొత్తమ్మీద చిత్రసీమ‌కు ఈ ఉదంతం షాక్‌కి గురిచేసింది. భ‌విష్యత్తులో ఇంకెంత అప్రమ‌త్తత‌తో ఉండాలో తెలియ జెప్పింది. ఇది టాలీవుడ్‌కి మాత్రమే కాదు, యావ‌త్ భార‌త దేశ చ‌ల‌న చిత్రప‌రిశ్రమ‌కు ఓ మేలుకొలుపు. వందేళ్ల పండుగ చేసుకొంటున్న ఈ శుభ త‌రుణంలో ఇలాంటి దుస్సంఘ‌ట‌న చోటు చేసుకొంది. ఈ స‌మ‌యంలోనైనా చిత్రసీమ మొత్తం ఏకం కావాలి. ఒక్క తాటిపై న‌డిచి పైర‌సీ పై పోరాడాలి. అందుకోసం ఎలాంటి చ‌ర్యలు తీసుకొంటుందో చూడాలి. అత్తారింటికి దారేది సినిమా విడుద‌లకు ముందే పైర‌సీ అయిన నేప‌థ్యంలో.. చిత్ర నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ షాక్‌కి గుర‌య్యారు. ఆయ‌నకు చిత్రసీమ బాస‌ట‌గా నిలిచింది. ఈ ప‌రిణామాల నుంచి తొంద‌ర‌గా తేరుకోమంటూ.. సంఘీభావం ప్రక‌టించింది. ప‌రిశ్రమ‌లో ఉన్న ప‌వ‌న్ ఫ్యాన్స్ కూడా… త‌మ నిర‌స‌న తెలియ‌జేస్తున్నారు. సిద్దార్థ్‌, హ‌రీష్ శంక‌ర్ ఇప్పటికే ట్విట్టర్‌లో పైర‌సీకి వ్యతికేకంగా త‌మ నిర‌స‌న గ‌ళాన్ని విప్పారు.

Exit mobile version