మొత్తమ్మీద చిత్రసీమకు ఈ ఉదంతం షాక్కి గురిచేసింది. భవిష్యత్తులో ఇంకెంత అప్రమత్తతతో ఉండాలో తెలియ జెప్పింది. ఇది టాలీవుడ్కి మాత్రమే కాదు, యావత్ భారత దేశ చలన చిత్రపరిశ్రమకు ఓ మేలుకొలుపు. వందేళ్ల పండుగ చేసుకొంటున్న ఈ శుభ తరుణంలో ఇలాంటి దుస్సంఘటన చోటు చేసుకొంది. ఈ సమయంలోనైనా చిత్రసీమ మొత్తం ఏకం కావాలి. ఒక్క తాటిపై నడిచి పైరసీ పై పోరాడాలి. అందుకోసం ఎలాంటి చర్యలు తీసుకొంటుందో చూడాలి. అత్తారింటికి దారేది సినిమా విడుదలకు ముందే పైరసీ అయిన నేపథ్యంలో.. చిత్ర నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ షాక్కి గురయ్యారు. ఆయనకు చిత్రసీమ బాసటగా నిలిచింది. ఈ పరిణామాల నుంచి తొందరగా తేరుకోమంటూ.. సంఘీభావం ప్రకటించింది. పరిశ్రమలో ఉన్న పవన్ ఫ్యాన్స్ కూడా… తమ నిరసన తెలియజేస్తున్నారు. సిద్దార్థ్, హరీష్ శంకర్ ఇప్పటికే ట్విట్టర్లో పైరసీకి వ్యతికేకంగా తమ నిరసన గళాన్ని విప్పారు.