నితిన్ చిత్రంలో పవన్ పాట

pavankalyan nithinపవన్ ను యూత్ ఐకాన్ గా నిలిపిన చిత్రం తొలిప్రేమ. పవన్ కెరీర్ లో ఈ చిత్రానికి ఇప్పటికి.. ఎప్పటికీ ఓ ప్రత్యేక స్థానం వుంటుంది. ఈ చిత్రంలోని కధ,కధనాలతో పాటు దేవా కంపోజ్ చేసిన పాటలు కూడా యూత్ ను ఉర్రుతలూగించాయి. తాజాగా ఈ చిత్రంలోని ‘ఏమయ్యిందో ఏమో నాకీవేళ’ అనే సూపర్ హిట్ ఫాస్ట్ బీట్ ని ‘గుండె జారి గల్లంతయ్యిందే’ సినిమాలో రీమిక్స్ చేస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా నితిన్ తెలిపాడు. ఈ సినిమాలో ఈ సాంగ్ హైలైట్ అవుతుంది. అలాగే ఈ సాంగ్ ని ఎంచుకోవడం ఒక చాలెంజ్ లాంటింది. కానీ ఎవ్వరినీ నిరుత్సాహ పరచకుండా, అందరూ మెచ్చుకునేలా ఈ పాట ఉంటుందని’ నితిన్ ట్విట్టర్ లో ట్వీట్ చేసాడు. నితిన్, నిత్యా మీనన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రం టైటిల్ కుడా పవన్ గబ్బర్ సింగ్ పాటలోనిదే. విషయం ఏమిటంటే నితిన్ పవర్ స్టార్ కు ఓ వీరాభిమాని. ‘ఇష్క్’ సినిమా ఆడియో కూడా పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా విడుదలైంది. ఈ సారి మరో అడుగు ముందు కేసి ఏకంగా పవన్ సాంగ్ నే తన సినిమాలో రీమిక్స్ చేసి నితిన్ పవన్ మీద తనకున్న అభిమానాన్ని మరోసారి చాటుకోనున్నాడు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఆడియో రిలీజ్ తేది ఖరారు కావాల్సివుంది.