రాష్ట్ర్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా.. ఆడియో వేడుక నిర్వహించడం అంత బాగోదేమో అని తుఫాన్ చిత్రబృందం భావించింది. అయితే తమ నిర్ణయాన్ని ఇప్పుడు మార్చుకొంది. సినిమా విడుదలకు అట్టే సమయం లేకపోవడంతో ఆడియోని భారీ ఎత్తున నిర్వహించి కొంత ప్రచారం చేసుకోవాలని తుపాన్ టీమ్ డిసైడ్ అయ్యింది. అందుకే ఈనెల 27 హైదరాబాద్ లో తుఫాన్ పాటల పండుగను నిర్వహించడానికి సమాయాత్తం అవుతోంది. ఈ వేడుకకు ప్రియాంకా చోప్రాతో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరవుతారట. వాళ్లందరి ముందూ తన తడాఖాను చూపించడానికి చరణ్ ఈ ఫంక్షన్ని ఓ అవకాశంగా తీసుకోవాలనుకొంటున్నాడు. తుఫాన్ సినిమాని వచ్చే నెల 6న విడుదల చేయనున్నారు.