Site icon TeluguMirchi.com

మూడు.. ‘మూడ్’ హాఫ్ చేసాయి..

గత నెలరోజులుగా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద సినిమాల సందడి నడుస్తుంది. కుప్పలు తిప్పలుగా సినిమాలు వస్తున్నాయి కానీ ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేకపోతున్నాయి. ఇక ఈ వారం కూడా మూడు క్రేజీ ప్రాజెక్ట్ లు బాక్స్ ఆఫీస్ బరిలోకి వచ్చాయి.

తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ” ఎన్ జి కే ” భారీ అంచనాల మధ్య విడుదల కాగా.. ‘ఈ నగరానికి ఏమైంది’ ఫేమ్ విశ్వక్ సేన్ నటించి డైరెక్ట్ చేసిన ఫలక్ నుమా దాస్ అనే తెలుగు చిత్రం కూడా విడుదల అయ్యింది. ఇక ప్రభుదేవా – తమన్నా జంటగా నటించిన అభినేత్రి 2 సైతం బరిలో నిలిచింది. వీటి తో పాటు సువర్ణ సుందరి , ఇంగ్లీష్ డబ్బింగ్ గాడ్జిల్లా చిత్రాలు వచ్చాయి. కానీ ఈ మూడు ప్రేక్షకుల ‘మూడ్’ హాఫ్ చేసాయి. ఎన్జికె మీద విపరీతమైన నెగటివ్ కామెంట్స్ వచ్చి పడుతున్నాయి. కథ చూసుకోకుండా సూర్య ఉన్నాడు కదాని శ్రీ రాఘవ చిత్తానికి సినిమాను తీసుకుంటూ పోయిన తీరుకి రివ్యూలు సైతం సింగల్ రేటింగ్ ఇచ్చాయి.

ప్రభుదేవా తమన్నాల అభినేత్రి 2 గురించి ఎక్కువ మాట్లాడుకోకపోవడం మంచిది. అసలెందుకు తీశారో అర్థం కాని విచిత్రమైన హారర్ కథతో ప్రేక్షకుల సహనానికి పరీక్షలు పెడుతోంది. ఇక స్ట్రెయిట్ మూవీగా సురేష్ సంస్థ నుండి వచ్చిన ఫలక్ నుమా దాస్ కు సైతం రెస్పాన్స్ ఏమంత పాజిటివ్ గా లేదు. ఇలా మూడు సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.

Exit mobile version