నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కలయికలో రూపుదిద్దుకొంటున్న చిత్రం లెజెండ్. రాధికాఆప్టే, సోనాలీ చౌహాన్ కథానాయికలు. 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ తెరకెక్కించింది. ఇటీవల దుబాయ్ లో కీలక సన్నివేశాల్ని, యాక్షన్ ఘట్టాల్నీ తెరకెక్కించారు. దుబాయ్ ట్రిప్ పూర్తి చేసుకొన్న లెజెండ్ బృందం ఇండియాలో అడుగుపెట్టింది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఓ పాట మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అదీ ఐటెమ్ సాంగ్. దాంతో చిత్రీకరణ పూర్తవుతుంది. మార్చి 28న గానీ, ఏప్రిల్ 4నగానీ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. మార్చి మొదటి వారంలో పాటల్ని విడుదల చేస్తారు. అంతకంటే ముందు ‘లెజెండ్’ టీజర్ని విడుదల చేస్తారని టాక్.