బాలీవుడ్ లో సంపాదించుకోవడానికి తెగ తాపత్రయపడింది తమన్నా. తొలి సినిమా హిమ్మత్వాలా డిజాస్టర్. హమ్ షకల్స్తో మరో ఛాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా కూడా దారుణంగా పల్టీకొట్టేసింది. ఈ సినిమా తర్వాత మరో ఆఫర్ రాలేదు తమన్నాకి. ఐతే ఇప్పుడు మరోసారి బాలీవుడ్ లో అడుగుపెట్టబోతుంది తమన్నా.
కునాల్ కోహ్లీ.. తమన్నా కోసం ఓ కథ సిద్ధం చేశాడు. హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. విశేషం ఇందులో సందీప్ కిషన్కీ ఓ పాత్ర దక్కింది. తమన్నా, సందీప్ జోడీగా కనిపిస్తారట. బాలీవుడ్లో ఇక అంతే సంగతులు అనుకొంటున్న తరుణంలో కునాల్ కోహ్లి కథ వినిపించడం, ఆ చిత్రం దక్షిణాది భాషల్లోనూ విడుదలయ్యే అవకాశాలుండడం తమన్నాకు కలిసొచ్చె అంశమే.