గత శుక్రవారం విడుదల అయి, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కొల్లగొడుతున్న ఎన్టీఆర్ ‘టెంపర్’..తాజాగా మరో రికార్డ్ కూడా తన ఖాతాలో వేసుకుంది. ఈ చిత్ర శాటిలైట్ రైట్స్ కూడా భారీ మొత్తానికే అమ్మడుపోయాయి. ఈ రైట్స్ను జెమినీ చానెల్ 7.50 కోట్లు చెల్లించి సొంతం చేసుకున్నారు. దీంతో చిత్ర నిర్మాత బ్లాక్ బస్టర్ బండ్ల గణేష్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు.
గత చిత్రాలు కాస్త కలెక్షన్స్ పరంగా నిరశ పరిచిన ఈ టెంపర్ మాత్రం , గణేష్ అనుకున్న దానికంటే ఎక్కవ కలెక్షన్స్ రాబట్టడం తో చిత్ర యూనిట్ తో కలిసి పార్టీ చేసుకున్నాడు. ఒక్క ఆంధ్ర , తెలంగాణా లోనే కాకుండా ఓవర్సేస్ లోకూడా కలెక్షన్స్ సునామిని సృష్టిస్తుంది. త్వరలోనే టెంపర్ కి సీక్వెల్ను తీయనున్నట్టు బండ్ల గణేష్ తెలిపారు.